Tuesday, May 16, 2017

ఆంధ్ర ప్రదేశ్ లో   రాజకీయాలు చూస్తుంటే వెగటు పుడుతోంది. ఇప్పటికే ముద్దాయిగా నిర్ధారించబడిన జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అయిపోదామా అని గుంటకాడ నక్కలాగా కాచుకొని వున్నాడు. మరోవైపు చంద్రబాబు వచ్ఛే ఎన్నికల్లో తానె గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమధ్య ఇలా కాదని జగన్ ప్రధాన మంత్రిని కలిసి ఏవో సంప్రదింపులు జరిపి వచ్ఛే ఎన్నికల్లో తానూ ముఖ్యమంత్రి కావడానికి సహాయం చేయమని ప్రధాని  కోరినట్లున్నాడు. అందుకు ప్రధాని ఏమి చెప్పాడో గాని తానూ ప్రధానిని కలిసిన విషయం ఎంతో గొప్పగా చెప్పుకొంటున్నారు జగన్. ప్రధాని జగన్కు ఎం సహాయం చేస్తాడో తెలియంది గాని ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడున్న సీట్లు కూడా పోగొట్టుకోడం ఖాయమని గ్రహించే ఉంటాడని ఆశించవచ్చు. ఇకపోతే ఈడీపై ఫిర్యాదు చేయడం చూస్తే ఎలాగోలా కేసులనుండి బయటపడాలని జగన్ తాపత్రయపడుతున్నట్లుంది. అదే జరిగితే ఈ దేశంతో న్యాయ వ్యవస్థ కూడా శుద్ధ వెస్ట్.